కాంగ్రెస్ పార్టీకి యూత్ కాంగ్రెస్ పునాది
- ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
- మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు చీకటి కార్తీక్ కు అభినందన
ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:
కాంగ్రెస్ పార్టీకి యూత్ కాంగ్రెస్ పునాది లాంటిదని, దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చెందటానికి ప్రధాన కారణం యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న కృషి అని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన చీకటి కార్తీక్ మర్యాదపూర్వకంగా మంత్రి పొంగులేటిని ఖమ్మంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. తొలుత నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..... ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని యువజన కాంగ్రెస్ నాయకుడు చీకటి కార్తీక్ కి సూచించారు


Comments