కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని కలిసిన ఎంపి కావ్య 

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని కలిసిన ఎంపి కావ్య 

 న్యూ ఢిల్లీ,తెలంగాణ ముచ్చట్లు: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఎంపీ డాక్టర్ కడియం కావ్య కేంద్ర పౌర విమానయన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా తెలంగాణలో నాలుగు కొత్త విమానాశ్రయాల ఏర్పాటుపై చర్చించారు. ముఖ్యంగా, వరంగల్ మామూనూరు విమానాశ్రయాన్ని త్వరగా పూర్తిచేయడంపై ఎంపీ కడియం కావ్య  కేంద్ర మంత్రికి  విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా, రామ్మోహన్ నాయుడు  వరంగల్ విమానాశ్రయ ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నట్లు, రోడ్డు కనెక్టివిటీ, మౌలిక వసతుల కల్పన, భూ సేకరణ పూర్తి అయిన తరువాత రెండు సంవత్సరాల్లో విమాన రాకపోకలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వరంగల్ పట్టణ అభివృద్ధికి 4,000 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు, నగరాన్ని రాష్ట్ర రెండవ రాజధానిగా అభివృద్ధి చేసేందుకు తీసుకున్న చర్యలను వివరించారు.
ఈ సందర్భంగా ఎంపీ కడియం కావ్య కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఎయిర్ పోర్ట్ అథారిటీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు

Tags:

Post Your Comments

Comments

Latest News

ప్రజాయుద్ధనౌక గద్దర్ జయంతి వేడుకలు  ప్రజాయుద్ధనౌక గద్దర్ జయంతి వేడుకలు 
కీసర, ఫిబ్రవరి 01(తెలంగాణ ముచ్చట్లు) తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసి, ప్రజల్లో చైతన్యం రగిలించిన ప్రజాయుద్ధనౌక గద్దర్ జయంతిని సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. పోరాట తత్వం,...
మాఘ పౌర్ణమి సందర్భంగా హేమాద్రి వెంకటేశ్వర స్వామి గిరి ప్రదక్షిణ 
గ్రామీణ వైద్యుల శిక్షణను తిరిగి ప్రారంభించాలి
స్పోర్ట్స్ మీట్ తో విద్యార్థుల్లో నూతన ఉత్తేజం పెంపొందుతుంది.
ధన్యజీవి ఏపూరి సీతయ్య
ప్రత్యేక సమగ్ర సవరణను పకడ్బందీగా నిర్వహించాలి.. 
ప్రభుత్వ ప్రాధాన్యత పనుల పూర్తిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి....