కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని కలిసిన ఎంపి కావ్య 

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని కలిసిన ఎంపి కావ్య 

 న్యూ ఢిల్లీ,తెలంగాణ ముచ్చట్లు: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఎంపీ డాక్టర్ కడియం కావ్య కేంద్ర పౌర విమానయన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా తెలంగాణలో నాలుగు కొత్త విమానాశ్రయాల ఏర్పాటుపై చర్చించారు. ముఖ్యంగా, వరంగల్ మామూనూరు విమానాశ్రయాన్ని త్వరగా పూర్తిచేయడంపై ఎంపీ కడియం కావ్య  కేంద్ర మంత్రికి  విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా, రామ్మోహన్ నాయుడు  వరంగల్ విమానాశ్రయ ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నట్లు, రోడ్డు కనెక్టివిటీ, మౌలిక వసతుల కల్పన, భూ సేకరణ పూర్తి అయిన తరువాత రెండు సంవత్సరాల్లో విమాన రాకపోకలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వరంగల్ పట్టణ అభివృద్ధికి 4,000 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు, నగరాన్ని రాష్ట్ర రెండవ రాజధానిగా అభివృద్ధి చేసేందుకు తీసుకున్న చర్యలను వివరించారు.
ఈ సందర్భంగా ఎంపీ కడియం కావ్య కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఎయిర్ పోర్ట్ అథారిటీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు

Tags:

Post Your Comments

Comments

Latest News

విద్యావంతులైన కార్మికులకు అవకాశాలు కల్పిస్తాం విద్యావంతులైన కార్మికులకు అవకాశాలు కల్పిస్తాం
జమ్మికుంట టౌన్, మార్చి 18 (తెలంగాణ ముచ్చట్లు): జమ్మికుంట మున్సిపల్ నూతన పాలకవర్గం ఏర్పాటైన నేపథ్యంలో పట్టణంలో పనిచేస్తున్న పారిశుద్య కార్మికులతో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్...
గిరిజనలకు ఇచ్చిన హామీలను అమలుకై 25వేల కోట్లు కేటాయించాలి 
రంగాపూర్‌లో ఘనంగా పోచమ్మ బోనాలు
గీత కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం -- చైర్మన్ సుహాసిని.
ఆపదలో అండగా పీఆర్టీయూ టిఎస్ ఉపాధ్యాయ సంఘం 
శ్రీ పరాభవ ఉగాది.... వసంత శోభ
తోవ