కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని కలిసిన ఎంపి కావ్య 

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని కలిసిన ఎంపి కావ్య 

 న్యూ ఢిల్లీ,తెలంగాణ ముచ్చట్లు: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఎంపీ డాక్టర్ కడియం కావ్య కేంద్ర పౌర విమానయన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా తెలంగాణలో నాలుగు కొత్త విమానాశ్రయాల ఏర్పాటుపై చర్చించారు. ముఖ్యంగా, వరంగల్ మామూనూరు విమానాశ్రయాన్ని త్వరగా పూర్తిచేయడంపై ఎంపీ కడియం కావ్య  కేంద్ర మంత్రికి  విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా, రామ్మోహన్ నాయుడు  వరంగల్ విమానాశ్రయ ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నట్లు, రోడ్డు కనెక్టివిటీ, మౌలిక వసతుల కల్పన, భూ సేకరణ పూర్తి అయిన తరువాత రెండు సంవత్సరాల్లో విమాన రాకపోకలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వరంగల్ పట్టణ అభివృద్ధికి 4,000 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు, నగరాన్ని రాష్ట్ర రెండవ రాజధానిగా అభివృద్ధి చేసేందుకు తీసుకున్న చర్యలను వివరించారు.
ఈ సందర్భంగా ఎంపీ కడియం కావ్య కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఎయిర్ పోర్ట్ అథారిటీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు

Tags:

Post Your Comments

Comments

Latest News

నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు
పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు): రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలంటే నాణ్యమైన వరి విత్తనాలను వాడటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించారు. పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి...
తుఫాన్ బాధిత రైతులను  ప్రభుత్వం ఆదుకోవాలి 
విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
మృతుని కుటుంబానికి మేఘన్న చేయూత
హరీష్‌రావు నివాసంలో రేగళ్ల సతీష్‌రెడ్డి, యువజన నేతల పరామర్శ
బీసీలకు 42% రిజర్వేషన్లపై కఠిన పోరాటం  ఈటల రాజేందర్
నారాయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్.!