భద్రకాళి,కాకతీయ మ్యూజికల్  గార్డెన్ పరిసరాలను పరిశీలించిన కుడా ఛైర్మన్

-మ్యూజికల్‌ గార్డెన్‌కు పూర్వ వైభవం తెస్తాం

భద్రకాళి,కాకతీయ మ్యూజికల్  గార్డెన్ పరిసరాలను పరిశీలించిన కుడా ఛైర్మన్

-కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి 

వరంగల్,తెలంగాణ ముచ్చట్లు:
వరంగల్ భద్రకాళి చుట్టూ మాడ వీధుల నిర్మాణం కొరకై,కాకతీయ మ్యూసికల్ గార్డెన్ లో చేపట్టనున్న అభివృద్ది పనులను కుడా వైస్ ఛైర్మన్ అశ్విని తానాజీ వాకడే, కుడా సీపీవో అజిత్ రెడ్డి, ఈఈ భీం రావు, హార్టికల్చర్‌ అధికార్లతో కలిసి కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ భద్రకాళి అమ్మవారి మాడ వీధులను త్వరితగతిన పూర్తి చేస్తామని, భద్రకాళి జలాశయం ను త్రాగు నీటి జలాశయంగా మారుస్తామని, భద్రకాళి చెరువు ఖబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. చెరువుపై సర్వే చేయించి నిర్మాణాలను తొలగిస్తామని తెలిపారు. అలాగే మ్యూజికల్‌ గార్డెన్‌కు పూర్వ వైభవం తెస్తామని వరంగల్‌లోని కాకతీయ మ్యూజికల్‌ గార్డెన్‌ పునరుద్ధరణ పనుల్లో వేగం పెంచామని, ఇప్పటికే దాదాపు 90శాతం పూర్తి అయిందని, త్వరలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని అన్నారు.  రూ.కోటీ 60 లక్షల కుడా నిధులతో గార్డెన్‌ పనులను చేపడుతున్నామని, రెండు మ్యూజికల్‌ ఫౌంటేన్‌లను ఏర్పాటు, వచ్చే సందర్శకులకు వీనుల విందైన సంగీతానికి అనుగుణంగా నాట్యం చేసే ఫౌంటేన్లను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. గార్డెన్‌ వెనుకబాగంలో ఒక ఫౌంటేన్‌, మధ్యలో ఒక ఫౌంటేన్‌ ఏర్పాటుచేసేలా ప్లాన్‌ చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.WhatsApp Image 2024-11-26 at 8.05.09 PM (1)

Tags:

Post Your Comments

Comments

Latest News

పాలాభిషేకాలతో కృతజ్ఞతలు.. రూ.45 కోట్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు. పాలాభిషేకాలతో కృతజ్ఞతలు.. రూ.45 కోట్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు.
- ప్రణవ్ బాబు కృషితో సాధ్యమైన అభివృద్ధి: కాంగ్రెస్ నేతల హర్షం - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రణవ్ బాబుకు పాలాభిషేకం జమ్మికుంట టౌన్ జూన్...
న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి.. కార్మికులకు అండగా నిలిచిన మున్సిపల్ చైర్మన్.
భావితరాలకు హరిత వారసత్వమే లక్ష్యం!
ఖమ్మంలో ఘనంగా టాలీ సర్టిఫైడ్ పార్టనర్ సంస్థ ఆఫీస్ ప్రారంభం.
ముడిసరుకు ధరల భారం.. జమ్మికుంటలో ఫోటోగ్రాఫర్ల బంద్ జయప్రదం"
ఇందిరమ్మ ఇళ్లలో ఆనంద దీపాలు.. గృహ ప్రవేశాల్లో పాల్గొన్న వొడితల ప్రణవ్.
గురుకుల సీట్లు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం.