నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా మంత్రి పొంగులేటి జన్మదిన వేడుకలు.!

నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా మంత్రి పొంగులేటి జన్మదిన వేడుకలు.!

అశ్వారావుపేట, అక్టోబర్ 28 (తెలంగాణ ముచ్చట్లు):

తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన సందర్భంగా అశ్వారావుపేట నియోజకవర్గవ్యాప్తంగా వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకలను ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. మొదటగా దమ్మపేట మండలం గండుగులపల్లి క్యాంపు కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరిపారు.

తదుపరి చండ్రుగొండ మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించి, సీతాయిగూడెం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. అనంWhatsApp Image 2025-10-28 at 6.21.15 PMWhatsApp Image 2025-10-28 at 6.21.10 PMతరం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు నిర్వహించిన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు.

అన్నపురెడ్డిపల్లి మండలం కేంద్రంలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రధాన సెంటర్లో పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో వేడుకలు జరిపారు.

ములకలపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు పుట్టినరోజు వేడుకలు నిర్వహించగా, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు.

చివరిగా అశ్వారావుపేట ప్రభుత్వ క్యాంపు కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి దీర్ఘాయుష్షు, ఆరోగ్యం కలగాలని ఆకాంక్షించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఖమ్మం జిల్లాలో జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల జారీని వేగవంతం చేయాలి.  ఖమ్మం జిల్లాలో జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల జారీని వేగవంతం చేయాలి. 
జిల్లా కలెక్టర్‌కు గ్రీవెన్స్ లో టిడబ్ల్యూజేఎఫ్ (హెచ్- 2843) వినతి. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నానబాల రామకృష్ణ,అర్వపల్లి నగేష్. ఖమ్మం బ్యూరో , ఆగస్టు 3(తెలంగాణ ముచ్చట్లు...
శ్రీనన్న ఆత్మీయ భరోసా..ప్రతి పేద కుటుంబ నమ్మకానికి ప్రతిక.
తెలంగాణ సాహితీ సంఘంలో గీతాకుమారికి స్థానం.
వేణుకుమార్ కుటుంబానికి నామ ట్రస్ట్ ద్వారా రూ.50 వేల ఆర్థిక సాయం.
బాధితులకు కొండంత అండగా పీఎస్ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్.
కాకర్లపల్లి పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి.
బాధితులకు కొండంత అండగా పీఎస్ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్.