అక్రమ నిర్మాణాలపై కమెడియన్ అలీకి నోటీసులు

అక్రమ నిర్మాణాలపై కమెడియన్ అలీకి నోటీసులు

వికారాబాద్,తెలంగాణ ముచ్చట్లు:

కమెడియన్ అలీకి ఊహించని షాక్ తగిలింది. అక్రమ నిర్మాణాలపై ఆయనకు తాజాగా నోటీసులు జారీ చేశారు అధికారులు. అక్రమ నిర్మాణాలు చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో అలీకి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. వికారాబాద్ నవాబ్ పేట, ఏక్ మామిడి రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ : 345 లో మహమ్మద్ అలీ తండ్రి స్వర్గీయ మహమ్మద్ భాషా పేరు మీద ఒక ఫామ్ హౌస్ ఉన్నది. ఈ ఫామ్ హౌస్ లో గ్రామ పంచాయతీ నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మాణం చేపట్టినట్లు గుర్తించిన గ్రామ పంచాయతీ కార్యదర్శి శోభారాణి ఈనెల 5న మొదటి నోటీసు జారీ చేశారు. అట్టి నోటీసుకు ఎలాంటి రిప్లై రాకపోవడంతో మళ్ళీ గత నవంబర్ 22 న శుక్రవారం మరో నోటీస్ ఇచ్చారు. ఈ నోటీసు ప్రకారం మూడు రోజుల్లో నిర్మాణానికి ఎలాంటి అనుమతులు ఉన్నాయి. దానికి సంబంధించిన పత్రాలు గ్రామ పంచాయతిలొ ఇవ్వాలని తెలిపారు.కాగా, ఈ నోటీసులపై తన తరఫు లాయర్ ద్వారా జవాబు చెప్పేందుకు అలీ సిదమవుతున్నటు సమాచారం. కొందరు తనపై చేస్తున్నారని అందులో భాగంగానే ఇలా నోటీసులు పంపారని ఆరోపిస్తున్నారట అలీ. అయితే దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఖమ్మం జిల్లాలో జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల జారీని వేగవంతం చేయాలి.  ఖమ్మం జిల్లాలో జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల జారీని వేగవంతం చేయాలి. 
జిల్లా కలెక్టర్‌కు గ్రీవెన్స్ లో టిడబ్ల్యూజేఎఫ్ (హెచ్- 2843) వినతి. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నానబాల రామకృష్ణ,అర్వపల్లి నగేష్. ఖమ్మం బ్యూరో , ఆగస్టు 3(తెలంగాణ ముచ్చట్లు...
శ్రీనన్న ఆత్మీయ భరోసా..ప్రతి పేద కుటుంబ నమ్మకానికి ప్రతిక.
తెలంగాణ సాహితీ సంఘంలో గీతాకుమారికి స్థానం.
వేణుకుమార్ కుటుంబానికి నామ ట్రస్ట్ ద్వారా రూ.50 వేల ఆర్థిక సాయం.
బాధితులకు కొండంత అండగా పీఎస్ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్.
కాకర్లపల్లి పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి.
బాధితులకు కొండంత అండగా పీఎస్ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్.