నూతన సంవత్సర వేడుకలను శాంతియుతంగా నిర్వహించుకోవాలి
సత్తుపల్లి ఎస్సై టి.కిరణ్
సత్తుపల్లి, తెలంగాణ ముచ్చట్లు:
నూతన సంవత్సర వేడుకలను శాంతియుతంగా, చట్టాలకు అనుగుణంగా నిర్వహించుకోవాలని సత్తుపల్లి ఎస్సై టి. కిరణ్ ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “వేడుకల సందర్భంగా ఎవరైనా చట్టాలను ఉల్లంఘించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నియమాలను అమలు చేస్తున్నాం. అందరూ సహకరించి వేడుకలను సురక్షితంగా జరుపుకోవాలి” అని పేర్కొన్నారు.
ఎస్సై కిరణ్ నూతన సంవత్సర వేడుకలకు సంబంధించిన ప్రత్యేక చర్యలను వివరించారు. “డిసెంబర్ 31న రాత్రి 1:00 గంటలోపు వేడుకలు ముగించాలి. బహిరంగ ప్రదేశాల్లో శాంతి భద్రతలకు భంగం కలిగించేలా ప్రవర్తించరాదు. మద్యం సేవించి వాహనాలు నడిపితే డ్రంక్ అండ్ డ్రైవ్తనిఖీల్లోపట్టుబడతారు. తగిన చర్యలు తప్పవు. చట్టాలను ప్రతి ఒక్కరూ పాటించడం అత్యవసరం” అని హెచ్చరించారు.
అనుమతులమేరకేవేడుకలనునిర్వహించుకోవాలని,ఫైర్క్రాకర్స్అధిక శబ్దంతో పాటలు ఉపయోగించవద్దనిఆయనతెలిపారు. “మీ చుట్టూ ఏదైనా అనుమానాస్పద పరిస్థితులు కనిపిస్తే వెంటనే 100 నంబర్కు కాల్ చేసి పోలీసుల సహాయం పొందండి” అని ఎస్సై సూచించారు.వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవడంలోప్రతిఒక్కరిసహకారంఅత్యవసరమని,చట్టాలపరమైన చర్యలగురించిముందుగాజాగ్రత్తగాఉండాలనిఆయన తెలిపారు.


Comments