పదవీ విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులు కు ఘనంగా సత్కరించిన

 రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు, ఐపీఎస్

పదవీ విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులు కు ఘనంగా సత్కరించిన

మల్కాజ్గిరి, తెలంగాణ ముచ్చట్లు:

రాచకొండ పోలీస్ కమిషనరేట్ లో పనిచేస్తూ పోలీసు అధికారులకు పదవీ విరమణ పొందిన టివి హనుమంత రావు, అడిషనల్ డీసీపీ,స్పెషల్ బ్రాంచ్,  ఎం సుగుణ, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్,   అకౌంట్స్, మహమ్మద్ షర్ఫుద్దీన్, సబ్ ఇన్స్పెక్టర్, సీసీఎస్ ఎల్ బి నగర్ డి రామకృష్ణ, సబ్ ఇన్స్పెక్టర్, కంట్రోల్ రూమ్ మహమ్మద్ ఫైజుద్దీన్, సబ్ ఇన్స్పెక్టర్  సీఐ సెల్, వి సాగర్ రావు, సబ్ ఇన్స్పెక్టర్  ఉప్పల్ ఉమెన్  పోలీస్ స్టేషన్,  మహమ్మద్ షంషీర్ ఖాన్, ఏఆర్ ఎస్ఐ హెడ్ క్వార్టర్ భువనగిరి లకు సీపీ శ్రీ సుధీర్ బాబు, ఐపీఎస్ రాచకొండ పోలీస్ కార్యాలయం లో సన్మానం చేయడం జరిగింది. 

ఈ సందర్భంగా సీపీ  మాట్లాడుతూ, పోలీసు ఉద్యోగం  ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని, విధి నిర్వహణలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఎంతో కాలం పాటు పోలీసుశాఖలో సమర్థవంతంగా, క్రమశిక్షణతో పనిచేసి తమ సేవలు అందించినందుకు అభినందించారు. పదవీ విరమణ అనంతరం విశ్రాంత జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని, ఆరోగ్యం పట్ల అధిక శ్రద్ధ చూపాలని, పెన్షన్ మరియు ఇతర ఆర్థిక అంశాల పట్ల క్రమశిక్షణ పాటించాలని సూచించారు. వారికి రావాల్సిన అన్ని రకాల ప్రయోజనాలు త్వరగా వచ్చే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పదవీ విరమణ పొందే అధికారులు మరియు సిబ్బంది సంక్షేమం కోసం తాను ఏర్పాటు చేసిన పెన్షన్ డెస్క్ ద్వారా త్వరగా పెన్షన్ మంజూరు చేయాలని అధికారులకు సూచించారు. WhatsApp Image 2025-07-31 at 3.29.21 PM

ఈ కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ ఇందిరా, డిసిపి ఎస్బి జి నరసింహ రెడ్డి,  అడిషనల్ డీసీపీ అడ్మిన్ శివ కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఎసిపి రవీందర్ రెడ్డి, సిఏఓ అడ్మిన్ పుష్పరాజ్, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు సిహెచ్. భద్రా రెడ్డి, కృష్ణా రెడ్డి, టేకుల రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ప్రాణాలకు ముప్పు… హుజురాబాద్ వద్ద వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్ట్‌కు గట్టి వ్యతిరేకం. ప్రాణాలకు ముప్పు… హుజురాబాద్ వద్ద వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్ట్‌కు గట్టి వ్యతిరేకం.
హుజురాబాద్, మే 2(తెలంగాణ ముచ్చట్లు ): హుజురాబాద్ పట్టణానికి సమీపంలోని సిర్సపల్లి గ్రామ శివారులో ప్రతిపాదించిన వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టును వెంటనే రద్దు చేయాలని వేస్ట్...
పత్రికా స్వేచ్ఛే ప్రజాస్వామ్యానికి ప్రాణం.
పామాయిల్ రైతులకు గుడ్ న్యూస్.!
పెద్దమందడి సింగిల్ విండో సీఈవో జగదీశ్వర్ రెడ్డికి ఘన వీడ్కోలు.
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యం.
వేలేరు మండల కేంద్రంలో ఘనంగా మే డే వేడుకలు.
ప్రపంచ కార్మికులారా ఏకంకండి నినాదాలతో మేడే.