పదవీ విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులు కు ఘనంగా సత్కరించిన

 రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు, ఐపీఎస్

పదవీ విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులు కు ఘనంగా సత్కరించిన

మల్కాజ్గిరి, తెలంగాణ ముచ్చట్లు:

రాచకొండ పోలీస్ కమిషనరేట్ లో పనిచేస్తూ పోలీసు అధికారులకు పదవీ విరమణ పొందిన టివి హనుమంత రావు, అడిషనల్ డీసీపీ,స్పెషల్ బ్రాంచ్,  ఎం సుగుణ, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్,   అకౌంట్స్, మహమ్మద్ షర్ఫుద్దీన్, సబ్ ఇన్స్పెక్టర్, సీసీఎస్ ఎల్ బి నగర్ డి రామకృష్ణ, సబ్ ఇన్స్పెక్టర్, కంట్రోల్ రూమ్ మహమ్మద్ ఫైజుద్దీన్, సబ్ ఇన్స్పెక్టర్  సీఐ సెల్, వి సాగర్ రావు, సబ్ ఇన్స్పెక్టర్  ఉప్పల్ ఉమెన్  పోలీస్ స్టేషన్,  మహమ్మద్ షంషీర్ ఖాన్, ఏఆర్ ఎస్ఐ హెడ్ క్వార్టర్ భువనగిరి లకు సీపీ శ్రీ సుధీర్ బాబు, ఐపీఎస్ రాచకొండ పోలీస్ కార్యాలయం లో సన్మానం చేయడం జరిగింది. 

ఈ సందర్భంగా సీపీ  మాట్లాడుతూ, పోలీసు ఉద్యోగం  ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని, విధి నిర్వహణలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఎంతో కాలం పాటు పోలీసుశాఖలో సమర్థవంతంగా, క్రమశిక్షణతో పనిచేసి తమ సేవలు అందించినందుకు అభినందించారు. పదవీ విరమణ అనంతరం విశ్రాంత జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని, ఆరోగ్యం పట్ల అధిక శ్రద్ధ చూపాలని, పెన్షన్ మరియు ఇతర ఆర్థిక అంశాల పట్ల క్రమశిక్షణ పాటించాలని సూచించారు. వారికి రావాల్సిన అన్ని రకాల ప్రయోజనాలు త్వరగా వచ్చే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పదవీ విరమణ పొందే అధికారులు మరియు సిబ్బంది సంక్షేమం కోసం తాను ఏర్పాటు చేసిన పెన్షన్ డెస్క్ ద్వారా త్వరగా పెన్షన్ మంజూరు చేయాలని అధికారులకు సూచించారు. WhatsApp Image 2025-07-31 at 3.29.21 PM

ఈ కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ ఇందిరా, డిసిపి ఎస్బి జి నరసింహ రెడ్డి,  అడిషనల్ డీసీపీ అడ్మిన్ శివ కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఎసిపి రవీందర్ రెడ్డి, సిఏఓ అడ్మిన్ పుష్పరాజ్, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు సిహెచ్. భద్రా రెడ్డి, కృష్ణా రెడ్డి, టేకుల రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రత్యేక రైలులో ఢిల్లీకి జెండా ఊపి రైలును ప్రారంభించిన  బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రత్యేక రైలులో ఢిల్లీకి జెండా ఊపి రైలును ప్రారంభించిన 
చర్లపల్లి, తెలంగాణ ముచ్చట్లు: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ ఈనెల 7న తలపెట్టిన ఛలో...
మీనాక్షి నటరాజన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు గట్టు రాజు 
భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి నందుకు కార్పొరేటర్ కు సంతోషం వ్యక్తం చేసిన కాలనీవాసులు. 
బోనాల పండుగ ఉత్సవాల లో పాల్గొన్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
దమ్మాయిగూడ జాతీయ మాల మహానాడు సంఘం అధ్యక్షులుగా 
50వ వివాహ వార్షికోత్సవ వేడుకలు బాబా సాహెబ్ సన్నిధిలో 
మల్లాపూర్ అంబేద్కర్ సంఘం బోనాల పండుగ వేడుకల్లో పాల్గొన్న