పకార వేతనాల కొరకు దరఖాస్తు చేసుకోవాలి...
కార్మిక శాఖ డిప్యూటీ కమీషనర్ కె. విజయ భాస్కర్ రెడ్డి
ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:
కార్మికుల పిల్లలు, కార్మికులు ఉపకార వేతనాలు కొరకు ఫిబ్రవరి 15 లోగా దరఖాస్తు చేయాలని కార్మిక శాఖ డిప్యూటీ కమీషనర్ కె. విజయ భాస్కర్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
దుకాణాలు, వాణిజ్య సంస్థలు, కర్మాగారాలు, మోటార్ రవాణా సంస్థలు, సహకార సంస్థలు, ఇతర ట్రస్ట్ లలో పనిచేయుచున్న కార్మికుల పిల్లలు, కార్మికులకు ప్రతిభ ఆధారంగా ఉపకార వేతనాలు అందించనున్నట్లు తెలిపారు. 2023-24 విద్యా సంవత్సరంలో పదవ తరగతి, ఐ.టి.ఐ. కోర్సు ఉత్తీర్ణులైన వారికి వెయ్యి రూపాయలు, పాలిటెక్నిక్ కోర్సుకు 1500 రూపాయలు, ఇంజినీరింగ్, మెడిసిన్, లా, బి.ఎస్.సి., బి.సి.ఏ., ఎం.సి. ఏ., బి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ, బి.బి.ఏ., యం.బి.ఏ., డిప్లొమా, పిజి డిప్లొమా ఇన్ మెడికల్ లేబొరేటరీ టెక్నీషియన్ కోర్సు ఉత్తీర్ణులైన వారికి రెండు వేల రూపాయలు ఉపకార వేతనం చెల్లించనున్నట్లు తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు మేడే నాటికి లబ్దిదారుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారని కె. విజయ భాస్కర్ రెడ్డి ఆ ప్రకటనలో తెలిపారు.


Comments