ఘనపూర్ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల బంద్ విజయవంతం

ఘనపూర్ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల బంద్ విజయవంతం

స్టేషన్ ఘనపూర్,తెలంగాణ ముచ్చట్లు: 

విద్యార్థుల ఆరోగ్యం, భవిష్యత్తు పట్ల నిర్లక్ష్యానికి నిరసనగా వామపక్ష విద్యార్థి సంఘాలు (ఏఐఎస్ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ) శనివారం నిర్వహించిన ప్రభుత్వ పాఠశాలల బంద్ ఘనపూర్ నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగింది.

ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జనగణ జిల్లా కన్వీనర్ ఎండి యూనస్ మాట్లాడుతూ, “విద్యాశాఖ మంత్రిని నియమించకుండానే సంవత్సరం పూర్తి కావడం విద్యావ్యవస్థపై ప్రభుత్వ ఉదాసీనతకు నిదర్శనం. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాల నాణ్యత లేక విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌కు గురవడం దురదృష్టకరం. ఈ ఘటనలపై ముఖ్యమంత్రి వెంటనే జోక్యం చేసుకుని బాధ్యత వహించాలి,” అని తీవ్రంగా విమర్శించారు.

విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం జవాబుదారిత్వంతో ముందుకురావాలని డిమాండ్ చేశారు. బంద్ కార్యక్రమంలో రామ్ బాబు, సాయి, మహి, రాజు తదితరులు పాల్గొన్నారు. పాఠశాలల మూసివేతకు విద్యార్థులు, తల్లిదండ్రుల నుండి మద్దతు లభించింది.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .