విగ్నేశ్వరుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి
ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి
తెలంగాణ ముచ్చట్లు దేవరుప్పుల:
ముందు మొక్కల వాడు ఆ గణపయ్య ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.సోమవారం మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద గణపయ్యకు ప్రత్యేక పూజలు చేసి అనంతరం నిర్వాహకులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గణపయ్య ఆశీస్సులు ప్రజలందరి పై ఉండి సుఖసంతోషాలతో తల తూగాలని ఆ దేవుని ప్రార్థించినట్లు తెలిపారు.అనంతరం భక్తులు అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు తీగల దయాకర్ జిల్లా నాయకులు పల్లా సుందర్ రాంరెడ్డి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ధరావత్ రామ్ సింగ్ నాయక్ మండల ప్రధాన కార్యదర్శి చింత రవి బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఏల సోమ సుందర్ జోగు సోమ నరసయ్య కారుపోతుల బిక్షపతి పిఎసిఎస్ డైరెక్టర్ కొత్త జలంధర్ రెడ్డి వంగ అర్జున్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు భక్తులు పాల్గొన్నారు.


Comments