నారాయణపురం రండి...!

సింగరేణి గెస్ట్ హౌస్ నిర్వహణ పై మంత్రి పొంగులేటి అసంతృప్తి

నారాయణపురం రండి...!

-  కల్లూరు మండలం నారాయణపురానికి ఆదివారం వచ్చి కలవాలని సిబ్బందికి ఆదేశాలు

ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:

తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్వంచలోని సింగరేణి గెస్ట్ హౌస్ నిర్వహణ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. పాల్వంచ పర్యటనకు శనివారం వచ్చిన ఆయన కాసేపు విశ్రాంతి తీసుకునేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఎంఎల్ఏలతో కలిసి గెస్ట్ హౌస్ కు వచ్చారు. ఈ సందర్భంలో అక్కడ సిబ్బంది చేసిన ఏర్పాట్లను చూసి అసహనం వ్యక్తం చేశారు. గదులు శుభ్రంగా లేకపోవడం, నిర్వహణలో లోపం ఉండటంతో అక్కడ ఉన్న సిబ్బందిని పిలిపించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయాన్నే కల్లూరు మండలం నారాయణ పురం గ్రామంలోని తన నివాసానికి సింగరేణి గెస్ట్ హౌస్ నిర్వహణ అధికారులు, సిబ్బంది అందరూ రికార్డ్స్ తీసుకుని హాజరు కావాలని ఆదేశించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .