అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తా
ఎమ్మెల్యే మట్టా రాగమయి
!- సత్తుపల్లి నియోజకవర్గం అభివృద్ధి కొరకు పలు మంత్రులను, చైర్మన్ లను కలిసిన..మట్టా
సత్తుపల్లి, తెలంగాణ ముచ్చట్లు:
హైదరాబాద్, మినిస్టర్స్ క్వార్టర్స్ లో తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్ పోర్ట్ మరియు బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ని, తెలంగాణ రాష్ట్ర ఎస్ సి, ఎస్ టి, మైనారిటీ వెల్ఫేర్ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మరియు రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని, మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ కుమార్ ని కలుసుకొని సత్తుపల్లి నియోజకవర్గం లోని పలు అభివృద్ధి కార్యక్రమాలు గురించి చర్చించారు. ఎమ్మెల్యే తో పాటు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ పాల్గొన్నారు.
సత్తుపల్లి నియోజకవర్గం లోని పెనుబల్లి మండలం, కల్లూరు మండలం లో నూతన బిసి గర్ల్స్ హాస్టల్స్ ఏర్పాటు చెయ్యాలి అని, కల్లూరు లో నూతన బిసి కమ్యూనిటీ హల్ ఏర్పాటు చెయ్యాలి అని మరియు పెనుబల్లి, సత్తుపల్లి ఆర్టీసీ బస్టాండ్ లో నూతన టాయిలెట్స్ మరియు సత్తుపల్లి నియోజకవర్గం లో ఆర్టీసీ బస్ స్టాండ్ లు ఆధునికరణ అభివృద్ధి కార్యక్రమాలు గురించి మంత్రి పొన్నం ప్రభాకర్ తో ప్రత్యేకంగా వారితో చర్చించి, మాట్లాడి వినతిపత్రం అందించారు.


Comments