పలు అభివృద్ధి పనులను పర్యవేక్షించిన కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి
ఉప్పల్, తెలంగాణ ముచ్చట్లు:
ఉప్పల్ డివిజన్ సౌత్ స్వరూప్ నగర్ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణం సహా పలు అభివృద్ధి పనులను కార్పొరేటర్ మందముల రజిత పరమేశ్వర్ రెడ్డి కాలనీ వాసులతో కలిసి పర్యవేక్షించారు.
ఎన్నో రోజులుగా పెండింగ్లో ఉన్న సీసీ రోడ్ల నిర్మాణానికి రూ. 1 కోటి 53 లక్షల నిధులు మంజూరయ్యాయని రజిత పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. అలాగే కాలనీలో వరద సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు రూ. 96 లక్షల వ్యయంతో స్ట్రోమ్ వాటర్ డ్రెయిన్ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఏఈ రాజ్ కుమార్, కాలనీ అధ్యక్షులు గజ్జల వెంకటరెడ్డి, రమణయ్య, జాల శ్రీను ప్రతాప్ రెడ్డి, బకారం లక్ష్మణ్, లుకాస్, సల్ల ప్రభాకర్ రెడ్డి, దేవి రెడ్డి, బాసి రెడ్డి, నర్సీ రెడ్డి, తిరుమల్ రెడ్డి, నారాయణ రావు, హరీష్, నంగి శ్రీను, నరేష్, భాష, యాదగిరి, హరి, సత్తి రెడ్డి, రంగా రెడ్డి, రామ్ రెడ్డి, మాధవరావు, జాల వెంకటేశ్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Comments