మహిళా ఉపాధ్యాయినిలకు సముచిత గౌరవం

వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘా రెడ్డి 

మహిళా ఉపాధ్యాయినిలకు సముచిత గౌరవం

WhatsApp Image 2025-01-03 at 9.12.56 PM

వనపర్తి, తెలంగాణ ముచ్చట్లు:

సావిత్రిబాయి పూలే జయంతి జనవరి 3వ తేదీని మహిళా ఉపాధ్యాయ దినోత్సవం గా  తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడంతో వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘా రెడ్డిమహిళా ఉపాధ్యాయినిలను సన్మానించారు.
తెలంగాణ రాష్ట్రంలోని మహిళా ఉపాధ్యాయినిలకు   రాష్ట్ర ముఖ్యమంత్రి  ఎనుముల రేవంత్ రెడ్డి  సారధ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం సముచితంగా గౌరవించిందని,  జనవరి 3న నిర్వహించే సావిత్రిబాయ్ పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవం గా ప్రకటించడం హర్షించదగ్గ విషయమని వనపర్తి ఎమ్మెల్యే  తూడి మేఘారెడ్డి గారు పేర్కొన్నారు.శుక్రవారం వనపర్తి పట్టణంలోని హరిజనవాడ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన కాంప్లెక్స్ లెవెల్ టి ఎల్ ఎం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ముందుగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ..అణగారిన వర్గాల బతుకులు మార్చిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని ఆయన అన్నారు.భారతదేశ మొదటి ఉపాధ్యాయురాలుగా  మహిళ లోకానికి  ఎన్నో గొప్ప సేవలందించిన త్యాగమూర్తి సావిత్రిబాయి పూలే అని ఎమ్మెల్యే పేర్కొన్నారు .మహిళా ఉపాధ్యాయినిలను ఎమ్మెల్యే  శాలువాలతో సన్మానించారు.వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన  విజ్ఞాన ప్రదర్శనను ఆయన సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు.విద్యార్థులు అందరూ  చదువుతోపాటు ఆటపాటలపై దృష్టి సారించి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆయన సూచించారు.ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు టై బెల్టుల ను అందజేశారు.కార్యక్రమంలో వనపర్తి జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘని, వనపర్తి పట్టణ మున్సిపల్ చైర్మన్ పుట్టపాకుల మహేష్, వనపర్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, పట్టణ కౌన్సిలర్లు, జిల్లా విద్యాశాఖ సెక్టోరియల్ అధికారులు  మహిళా అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .