ప్రతి ఒక్కరి ఆశ...ఆకాంక్ష నెరవేరాలి -
నూతన సంవత్సరం కొత్త వెలుగులు నింపాలి
-
- మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
- క్యాంపు కార్యాలయంలో నూతన సందడి

ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు: ప్రతి ఒక్కరి ఆశ.... ఆకాంక్ష నెరవేరాలని, అందరీ జీవితాల్లో నూతన సంవత్సరం కొత్త వెలుగులు నింపాలని దేవుణ్ణి కోరుకుంటున్నట్లు తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. ఖమ్మంలోని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో గురువారం నూతన సందడి నెలకొంది. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సహా ఇతర జిల్లా ఉన్నతాధికారులు, కిందిస్థాయి అధికారులు, వివిధ హెూదాల్లో పనిచేస్తున్న పోలీసు అధికారులు, రాజకీయ, వ్యాపార, వాణిజ్య ప్రముఖులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు మంత్రిని కలిసి నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలు మీడియా సంస్థలు, సంఘాలు, వ్యాపార సంస్థలకు చెందిన డైరీలను, క్యాలండర్ లను పొంగులేటి ఆవిష్కరించారు.


Comments