మహిళలకు స్వయం ఉపాధి శిక్షణకు ఆర్థిక సహాయం

మర్రి రాజశేఖర్ రెడ్డి, జగదీష్ గౌడ్

మహిళలకు స్వయం ఉపాధి శిక్షణకు ఆర్థిక సహాయం

WhatsApp Image 2025-10-16 at 7.34.24 PM మల్కాజిగిరి, అక్టోబర్ 16 (తెలంగాణ ముచ్చట్లు):

మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా ముందడుగుగా మల్కాజిగిరి డివిజన్ సర్దార్ పటేల్ నగర్ మహిళా సమైక్య గ్రూప్ మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందజేశారు. మల్కాజ్గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి రూ. 1,50,000/-, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ రూ. 1,00,000/- మంజూరు చేశారు. మొత్తం రూ. 2,50,000/- (రెండు లక్షల యాభై వేల రూపాయలు) మహిళల శిక్షణా కార్యక్రమం కోసం వినియోగించనున్నారు.ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ మాట్లాడుతూ, మహిళలు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, రుణ సదుపాయాలను ఉపయోగించుకొని ఆర్థికంగా ఎదగాలని పిలుపు నిచ్చారు. కుట్టు యంత్రాలు, ఇతర ఉపాధి సామాగ్రి కొనుగోలు చేసి స్వయం ఉపాధిని ఎంచుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మహిళా సమైక్య గ్రూప్ సభ్యులు ప్రేమలత, చంద్రకళ, లలిత, శారద, జయశ్రీ, వసంత, భాగ్యలక్ష్మి, మంజుల, తార, బిఆర్ఎస్ పార్టీ నాయకులు లక్ష్మణరావు, నీలం సతీష్, రాములు, శ్రీకాంత్, నవీన్ మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఆహార పట్టిక  ప్రకారం భోజనం తప్పనిసరి. ఆహార పట్టిక  ప్రకారం భోజనం తప్పనిసరి.
పెద్దమందడి,ఏప్రిల్21(తెలంగాణ ముచ్చట్లు)   వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో మంగళవారం గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం ఆకస్మికంగా ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా...
అంగన్వాడి టీచర్లకు ఉచిత స్మార్ట్‌ఫోన్లు.
సేవలకు గుర్తింపు – ఇద్దరు ఏఎస్ఐలకు ఉత్తమ సేవ పథకం.
వనపర్తిలో శ్రీ శుభం గ్రూపు కార్యాలయం ప్రారంభం.
నేషనల్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ కౌన్సిల్ వనపర్తి జిల్లా అధ్యక్షుడిగా డి. రవి ప్రసాద్ నియామకం
మేడే వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలి: సిఐటియు పిలుపు
సిర్సపల్లి వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌పై ప్రిన్సిపల్ సెక్రటరీతో వొడితల ప్రణవ్ భేటీ