మహిళలకు స్వయం ఉపాధి శిక్షణకు ఆర్థిక సహాయం
మర్రి రాజశేఖర్ రెడ్డి, జగదీష్ గౌడ్
మల్కాజిగిరి, అక్టోబర్ 16 (తెలంగాణ ముచ్చట్లు):
మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా ముందడుగుగా మల్కాజిగిరి డివిజన్ సర్దార్ పటేల్ నగర్ మహిళా సమైక్య గ్రూప్ మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందజేశారు. మల్కాజ్గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి రూ. 1,50,000/-, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ రూ. 1,00,000/- మంజూరు చేశారు. మొత్తం రూ. 2,50,000/- (రెండు లక్షల యాభై వేల రూపాయలు) మహిళల శిక్షణా కార్యక్రమం కోసం వినియోగించనున్నారు.ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ మాట్లాడుతూ, మహిళలు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, రుణ సదుపాయాలను ఉపయోగించుకొని ఆర్థికంగా ఎదగాలని పిలుపు నిచ్చారు. కుట్టు యంత్రాలు, ఇతర ఉపాధి సామాగ్రి కొనుగోలు చేసి స్వయం ఉపాధిని ఎంచుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మహిళా సమైక్య గ్రూప్ సభ్యులు ప్రేమలత, చంద్రకళ, లలిత, శారద, జయశ్రీ, వసంత, భాగ్యలక్ష్మి, మంజుల, తార, బిఆర్ఎస్ పార్టీ నాయకులు లక్ష్మణరావు, నీలం సతీష్, రాములు, శ్రీకాంత్, నవీన్ మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Comments