పేద ప్రజల ఆరోగ్య భరోసా కోసం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సాయం అందజేశారు.
Views: 30
On
ఐనవోలు మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన రుషగాని రాజేశ్వర్ రావుకు ₹2.5 లక్షలు, వేలేరు మండలం నోముల ప్రతాప్కు ₹2.5 లక్షలు, మొత్తం ₹5 లక్షల విలువైన ఎల్ఓసీలు మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుటుంబ సభ్యులకు అందజేశారు.
అనారోగ్యంతో చికిత్సకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం ఎమ్మెల్యే దృష్టికి రావడంతో వెంటనే స్పందించి సహాయం అందించారు. లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యమని, ఆరోగ్యశ్రీలో చేరని వ్యాధులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా వైద్య సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నిధి అనేక నిరుపేదల ప్రాణాలను కాపాడుతోందని అన్నారు.కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు..jpeg)
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments