సర్వజ్ఞ విద్యార్ధులకి బంగారు పతకాలు

సర్వజ్ఞ విద్యార్ధులకి బంగారు పతకాలు

ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:

ఖమ్మంలోని వీడివోస్ కాలనీలో గల సర్వజ్ఞ పాఠశాలయందు 2వ తరగతి చదువుతున్న విద్యార్ధులు జి. కర్ణిక మరియు జి. త్రినయన్ రోలర్ స్కిటింగ్ కాంపిటీషన్ లో ప్రతిభను చాటుకున్నరు. తెలంగాణ రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ వారు హైదరాబాద్ లో నిర్వహించిన 2వ తెలంగాణ ర్యాంకింగ్ ఓపెన్ రోలర్ స్కేటింగ్ చాంపియన్షిప్ 2024 లో ఖమ్మం జిల్లా తరుపున సర్వజ్ఞ పాఠశాల విద్యార్థులు జి. కర్ణిక మరియు జి. త్రినయన్ బంగారు మరియు వెండి పతకాలు గెలుచుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ ఆర్. వి. నాగేంద్ర కుమార్  మాట్లాడుతూ స్కేటింగ్ కాంపిటీషన్ లో బంగారు మరియు వెండి పతకాలతో అద్భుతమైన విజయం సాధించిన మా ప్రతిభావంతులైన క్రీడాకారులందరికీ నేను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారి అంకితభావం, కృషి మరియు క్రీడా స్ఫూర్తి మమ్మల్ని ఎంతగానో గర్వపడేలా చేశాయి. ఈ విజయాలు విద్యార్ధుల నిబద్ధతకు మరియు మా సిబ్బంది అందించిన అద్భుతమైన శిక్షణకు నిదర్శనం. భవిష్యత్తులో కూడా సర్వజ్ఞ మీ విజయాన్ని ఆశిస్తున్నది అని తెలియజేశారు. అలాగే డైరెక్టర్ శ్రీమతి కే. నీలిమ మాట్లాడుతూ సర్వజ్ఞ పాఠశాల విద్యార్ధులు చదువుల్లో, ఆటల్లో, క్రమశిక్షణలో అన్ని రంగాలలో విజయాలు సాధించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్ పవిత్ర మరియు ఉపాధ్యాయులు క్రీడాకారులకి అభినందనలు తెలియజేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .