గ్రూప్ వన్ లో సత్తా చాటిన గోవిందాపురం (ఏ) గ్రామ వాసి 

 రాష్ట్రంలో 92వ ర్యాంకుతో 'డీపీఓ' పోస్ట్ సాధించిన భాగం నిఖిల రామచంద్ర

గ్రూప్ వన్ లో సత్తా చాటిన గోవిందాపురం (ఏ) గ్రామ వాసి 

ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్ 28, తెలంగాణ ముచ్చట్లు;

బోనకల్ మండల పరిధిలోని గోవిందాపురం ఏ గ్రామ వాసి, భాగం రాము, గీతాదేవి ల కుమార్తె(భాగం నారాయణరావు నిర్మలాదేవి మనవరాలు)  భాగం నిఖిల గ్రూప్ వన్ లో సత్తా చాటి జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ ) పోస్ట్ సాధించింది. మొదటి మొదటి నుండి చదువుల్లో రారాణి గానే నిలిచింది. పదవ తరగతి వరకు డీఏవి పబ్లిక్ స్కూల్లో చదివి, విజయవాడ (గొల్లపూడి) నారాయణ జూనియర్ కాలేజీలో 98% మార్కులతో ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసింది. నారాయణ ఐఏఎస్ అకాడమీలో 90% మార్కులతో కాలేజ్ టాపర్ గా డిగ్రీ పట్టా అందుకుంది. దూరవిద్య ద్వారా ఎంఏ సోషియాలజీ పూర్తి చేసిన నిఖిల యుజిసి నెట్  రాసి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్  సాధించారు. తాజాగా వెలువడిన గ్రూప్ వన్ ఫలితాలలో స్టేట్ 92వ ర్యాంకు సాధించి డీపీఓ పోస్ట్  సాధించారు. ఆమె విజయం పట్ల గోవిందాపురం ఏ గ్రామ ప్రజలు కాంగ్రెస్ నాయకులు భాగం నాగేశ్వరరావు, భాగం పాపారావు భాగం నిఖిల డిపిఓ పోస్ట్ సాధించటం గోవిందాపురం ఏ గ్రామానికి గర్వకారణం అని అన్నారు.  గ్రామస్తులు, మండల అధికారులు అభినందనలు తెలిపారు

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .