డాక్టర్ మర్యాల ప్రవీణ్ కు ఘనంగా సన్మానం
కాజీపేట్ సెప్టెంబర్ 9 (తెలంగాణ ముచ్చట్లు)
వరంగల్ ఎన్ఐటి నుండి డాక్టరేట్ పట్టా పొందిన డాక్టర్ మర్యాల ప్రవీణ్ కు తేజోమయి మాలకుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మర్యాల కృష్ణ కార్యదర్శి బండి విజయకుమార్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ ప్రవీణ్ సాంకేతిక పరిజ్ఞానంలో దిట్టఅనిఆయన కొనియాడారు. డాక్టర్ అంబేద్కర్ విద్యా సిద్ధాంతాలు సామాజిక సమానత్వ సూత్రాలను అనుసరించి ముందుకు వెళ్లారని అన్నారు. ప్రవీణ్ కు తల్లిదండ్రుల అందించిన ప్రోత్సాహాన్ని ప్రశంసిస్తూ పలువురు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో 47 వ డివిజన్ కార్పొరేటర్ సంకునరసింగరావు సంఘ కోశాధికారి పప్పుల గోవర్ధన్, మైసారపు సిరి లారెన్స్, హన్మకొండ జిల్లా బార్ కౌన్సిల్ అసోసియేషన్ సభ్యుడు కొత్త రవి కoదరీ రాజమౌళి, ఎన్ ఐ టి ప్రొఫెసర్ ప్రకాష్ కొడలి, బండి రామచందర్ ,పదిదల శేఖర్, కాలేశ్వరం వెంకటేష్, బోయిన వెంకట్రావు ,బండం కుమారస్వామి, బరాబరి ఉప్పల్ రావు, పర్ష బాబురావు, బండారి నర్సింగరావు, జనపట్ల యాదగిరి, పట్నం మనోహర్, పరాలపల్లి రాజేష్ ,వంశీ ,గొర్రె ఈశ్వర్, పర్ష బలరాం, వెంకటేష్ లతోపాటు తదితరులు పాల్గొన్నారు.


Comments