మాఇల్లు ఆశ్రమంలో జనసేనాని జన్మదిన వేడుకలు
ఆశ్రమ పిల్లలతో కేక్ కట్ చేసిన జనసేన ఇంచార్జ్ గాదె పృథ్వ
Views: 50
On
జఫర్గడ్,తెలంగాణ ముచ్చట్లు:
జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. మండలంలోని మాఇల్లు ప్రజాదరణ ఆశ్రమంలో జనసైనికులు ఏర్పాటు చేసిన అన్నదానం, ఆశ్రమ పిల్లలతో సహాపంక్తి భోజన కార్యక్రమంలో జనసేనపార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ గాదె పృథ్వి పాల్గొని విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం ఆశ్రమ ఆవరణలో మొక్కలు నాటారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి వేడుకలు ఆశ్రమ పిల్లలతో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు మహమ్మద్ రజాక్, మినుముల సంజయ్, భూక్యా హుస్సేన్, కొలిపాక వంశీకృష్ణ,సయ్యద్ కాశీం,మునిగాల పవన్,గ్యార బన్నీ, విశాల్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments