ఎస్సీ వర్గీకరణపై ప్రతిపాదనలు సమర్పించిన అనంతపురం కమలేష్
హన్మకొండ,తెలంగాణ ముచ్చట్లు:
తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలుకు ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్కి స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు అనంతపురం కమలేష్ ప్రతిపాదనలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ పూర్తయ్యే వరకు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు నిలిపివేయాలని, రిజర్వేషన్లను ఎస్సీ లోని 59 కులాలకు వారి జనాభా నిష్పత్తి ప్రకారం కేటాయించాల్సిన అవసరం ఉందని సూచించారు.మాదిగ కులం ఉమ్మడి రిజర్వేషన్లలో తీవ్ర నష్టపోయిందని, ఎస్సీ జనాభాలో 70 శాతం ఉన్న మాదిగలకు రిజర్వేషన్లలో 70 శాతం వాటా ఇవ్వాలని కమలేష్ డిమాండ్ చేశారు. అలాగే మాదిగలను ఒక గ్రూపు, మాలలను ఒక గ్రూపు, ఉప కులాలను మరో గ్రూపుగా విభజించి, వారి జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని సూచించారు.ఈ ప్రతిపాదనలు ఎస్సీ వర్గీకరణ కమిషన్ చైర్మన్ షమీమ్ అక్తర్కు వినతిపత్రం ద్వారా అందజేశారు. ఈ కార్యక్రమంలో తాటికాయల రఘు, కొంగ రాజు, కృష్ణ తేజ తదితరులు పాల్గొన్నారు.


Comments