ఖమ్మంలో కదులుతున్న రైలులో ప్రత్యక్షమైన కొండ చిలువ

ఖమ్మంలో కదులుతున్న రైలులో ప్రత్యక్షమైన కొండ చిలువ

ఖమ్మం బ్యూరో, అక్టోబర్ 29, తెలంగాణ ముచ్చట్లు;

ఖమ్మం లో కొండ చిలువ కలకలం రేపింది. కదులుతున్న రైలులో ఓ కొండ చిలువ ప్రయాణీకులను భయభ్రాంతులకు గురిచేసింది. రైల్వే పోలీసులు సకాలంలో స్పందించి కొండ చిలువను పట్టుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వరంగల్ నుంచి విజయవాడ వెళ్లే మార్గంలో అండమాన్ ఎక్స్‌ప్రెస్‌లో ఎస్ 2  ఏసీ బోగీలో మూత్రశాల వద్ద కొండ చిలువను చూసిన ప్రయాణీకులు భయాందోళనలకు గురయ్యారు. బిగ్గరగా కేకలు పెట్టారు. టిటిఇ అక్కడకు చేరుకుని పామును గుర్తించి సమీప రైల్వే స్టేషన్ ఖమ్మం ఆర్‌పిఎఫ్ పోలీసులకు సమాచారం అందించాడు. వారు ఖమ్మం నగరానికి చెందిన పాములు పట్టే మస్తాన్ అనే వ్యక్తిని పిలిపించారు. ఖమ్మం రైల్వేస్టేషన్‌లో రైలు ఆగగానే రైల్వే పోలీసులు మస్తాన్ బోగి వద్దకు వెళ్లి కొండ చిలువను పట్టుకున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .