కొత్తకొండ వీరభద్ర స్వామిని దర్శించుకున్న కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి
Views: 50
On
భీమదేవరపల్లి,తెలంగాణ ముచ్చట్లు: భీమదేవరపల్లి మండలంలోని సుప్రసిద్ధ కొత్తకొండ శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామిని వరంగల్ కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభం, గుమ్మడికాయతో ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
ఆలయ చరిత్రను వివరించిన వేద అర్చకులు, వీరభద్ర స్వామి ఆవిర్భావం మరియు గుమ్మడికాయలు, కోరమీసాలు సమర్పించే సంప్రదాయంపై ప్రాశస్త్యంగా చెప్పారు. 100 ఏళ్ల నాటి ఈ ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తే భక్తుల కోరికలు నెరవేరుతాయని విశ్వాసం ఉంది.
ఇనగాల వెంకట్రామ్ రెడ్డి పూజల అనంతరం వేద ఆశీర్వచనం స్వీకరించి తీర్థ ప్రసాదాలు అందుకున్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments