సొంత నిధులతో నిర్మించిన వాటర్ ట్యాంకులను ప్రారంభించిన
ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
మల్కాజ్గిరి, తెలంగాణ ముచ్చట్లు:
గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని హిల్ టాప్ కాలనీలో ఇది సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టామని మల్కాజ్గిరి శాసనసభ్యులు మరియు రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. డివిజన్ పరిధిలోని హిల్ టాప్ కాలనీలో కాలనీవాసులు కొంతకాలంగా నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే మూడున్నర లక్షల రూపాయల వ్యయంతో ఎమ్మెల్యే తన సొంత నిధులతో పవర్ బోరు నీటి స్టోరేజీ కోసం ఐదు వాటర్ ట్యాంకులను ఇటీవల నిర్మించారు నిర్మించిన
వాటర్ ట్యాంకులను సోమవారం స్థానిక కార్పొరేటర్ మేకల సునీత రాముల వారితో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మల్కాజిగిరిలో దశాబ్ద కాలంగా నెలకొన్న దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మేకల రాము యాదవ్, బైరు అనిల్, ప్రేమ్ కుమార్, అశోక్ యాదవ్ తదితరులున్నారు.


Comments