వరి కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి
తెలంగాణ రైతు సంఘం డిమాండ్.
.దమ్మపేట, అక్టోబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ రైతు సంఘం (ఏ.ఐ.కే.ఎస్) దమ్మపేట మండల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు రైతులు ధర్నా నిర్వహించారు. మండలంలో వరి కోతలు ప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, మద్దతు ధరకు రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుతం రైతులు తక్కువ ధరకు ప్రైవేటు వ్యాపారులకు ధాన్యం అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం క్వింటాలుకు రూ.500 బోనస్ ఇవ్వాలని, గతంలో రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యానికి పెండింగ్లో ఉన్న బోనస్ బకాయిలు తక్షణం చెల్లించాలని కోరారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, తహసీల్దార్ భగవాన్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు దొడ్డా లక్ష్మీనారాయణ, మండల ఉపాధ్యక్షుడు మోరంపూడి శ్రీనివాసరావు, రైతు నాయకులు రావుల శోభన్ బాబు, కొలిక్కి పోగు శ్రీనివాసరావు, చెన్నుబోయిన బ్రహ్మయ్య, తంగెళ్ళమూడి రమేష్, కొప్పుల శ్రీనివాసరావు, తంగెళ్ళమూడి నాగు, రామారావు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


Comments