ధాన్యం రైతులకు పేమెంట్ వెంటనే చేయాలి

-హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య

ధాన్యం రైతులకు పేమెంట్ వెంటనే చేయాలి

హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు: 

ధాన్యం విక్రయించిన రైతులకు పేమెంట్ విషయంలో ఆలస్యం లేకుండా త్వరగా చెల్లింపులు పూర్తిచేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య అధికారులను ఆదేశించారు.గురువారం జిల్లా కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోలు మరియు పేమెంట్ అంశంపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇప్పటివరకు జరిగిన ధాన్యం కొనుగోలు, మిల్లులకు తరలింపు, ఆన్లైన్ ప్రక్రియ, రైతులకు పేమెంట్ వివరాలను కలెక్టర్ సమీక్షించారు.

ఈ సందర్భంగా ప్రావిణ్య మాట్లాడుతూ, రైతుల పేమెంట్ ప్రక్రియ వేగంగా సాగించాలని, అలాగే సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన బోనస్ సొమ్ము కూడా వెంటనే చెల్లించాల్సిన అవసరాన్ని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, వ్యవసాయ శాఖ, పౌర సరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారమే మేడేకు నిజమైన అర్థం భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారమే మేడేకు నిజమైన అర్థం
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:  ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని మనం ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటున్నాం. కానీ ఈ పండుగకు నిజమైన అర్థం వచ్చేలా కార్మికుల జీవితాల్లో మార్పు రావాలి....
భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారమే మేడేకు సార్థకత
క్రికెట్ క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే
మే డే వాల్ పోస్టర్ విడుదల
ఇందిరమ్మ ఇళ్లతో పేదల కలలు సాకారం
దేశానికి ఆదర్శంగా భూ భారతి చట్టం... 
శ్రీ మహాత్మా బసవేశ్వర జయంతి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి......