ధాన్యం రైతులకు పేమెంట్ వెంటనే చేయాలి

-హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య

ధాన్యం రైతులకు పేమెంట్ వెంటనే చేయాలి

హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు: 

ధాన్యం విక్రయించిన రైతులకు పేమెంట్ విషయంలో ఆలస్యం లేకుండా త్వరగా చెల్లింపులు పూర్తిచేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య అధికారులను ఆదేశించారు.గురువారం జిల్లా కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోలు మరియు పేమెంట్ అంశంపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇప్పటివరకు జరిగిన ధాన్యం కొనుగోలు, మిల్లులకు తరలింపు, ఆన్లైన్ ప్రక్రియ, రైతులకు పేమెంట్ వివరాలను కలెక్టర్ సమీక్షించారు.

ఈ సందర్భంగా ప్రావిణ్య మాట్లాడుతూ, రైతుల పేమెంట్ ప్రక్రియ వేగంగా సాగించాలని, అలాగే సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన బోనస్ సొమ్ము కూడా వెంటనే చెల్లించాల్సిన అవసరాన్ని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, వ్యవసాయ శాఖ, పౌర సరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు
పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు): రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలంటే నాణ్యమైన వరి విత్తనాలను వాడటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించారు. పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి...
తుఫాన్ బాధిత రైతులను  ప్రభుత్వం ఆదుకోవాలి 
విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
మృతుని కుటుంబానికి మేఘన్న చేయూత
హరీష్‌రావు నివాసంలో రేగళ్ల సతీష్‌రెడ్డి, యువజన నేతల పరామర్శ
బీసీలకు 42% రిజర్వేషన్లపై కఠిన పోరాటం  ఈటల రాజేందర్
నారాయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్.!