మొంథా తుఫాన్ ప్రభావంతో సత్తుపల్లి సింగరేణి గనుల్లో ఉత్పత్తి అంతరాయం
.సత్తుపల్లి, అక్టోబర్ 29 (తెలంగాణ ముచ్చట్లు):
మొంథా తుఫాన్ ప్రభావంతో సత్తుపల్లి పరిధిలోని సింగరేణి బొగ్గు గనుల్లో భారీ వర్షాలు కురవడంతో ఉత్పత్తి కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
జె.వి.ఆర్. ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు ప్రాంతంలో 25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదై, దాంతో సుమారు 1.50 లక్షల ఘన మీటర్ల మట్టి (ఓ.బి) మరియు 25 వేల టన్నుల బొగ్గు తడిసి పనులు నిలిచిపోయాయి.
అలాగే, కిస్టారం ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు పరిధిలో 29 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదై, సుమారు 50 వేల ఘన మీటర్ల మట్టి (ఓ.బి) మరియు 10 వేల టన్నుల బొగ్గు ప్రభావితమయ్యాయి.
వర్షం కారణంగా గనుల ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండటంతో యంత్రాలు కదలలేని పరిస్థితి ఏర్పడింది. వర్షపు నీటిని తొలగించే పనులు వేగంగా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. వాతావరణం అనుకూలించిన వెంటనే ఉత్పత్తి పునఃప్రారంభిస్తామని సింగరేణి అధికారులు స్పష్టం చేశారు.


Comments