సత్తుపల్లి సింగరేణిలో బొగ్గు రవాణా ఆధునికతలను సమీక్షించిన
డైరెక్టర్ (ఈ & ఎమ్) ఎం. తిరుమల రావు.
సత్తుపల్లి, సెప్టెంబర్ 20 (తెలంగాణ ముచ్చట్లు):
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ డైరెక్టర్ (ఈ & ఎమ్) ఎం. తిరుమల రావు జె.వి.ఆర్. బొగ్గు నిర్వహణ కేంద్రం, సత్తుపల్లి, కొత్తగూడెం ప్రాంతాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన బొగ్గు రవాణా, నిర్వహణ మరియు సాంకేతిక పరిజ్ఞానాలను క్షుణ్ణంగా సమీక్షించారు. ముఖ్యంగా సైలోలో రాపిడ్ లోడింగ్ వ్యవస్థ, డి.ఎఫ్.డి.ఎస్. విధానాలు మరియు విండ్ వ్యారియర్ ప్రగతిని పరిశీలించి, అధికారులకు ముఖ్య సూచనలు అందించారు.
ఎం. తిరుమల రావు ఈ ఆధునిక సాంకేతికతల వల్ల బొగ్గు రవాణాలో సమయం ఆదా, లోడింగ్ సామర్థ్యం పెరుగుదల, అలాగే భద్రతా ప్రమాణాల కచ్చిత నిర్వహణ సాధ్యమవుతుందని అధికారులు తో చర్చించారు. సత్తుపల్లి కేంద్రం సింగరేణి రవాణా లక్ష్యాలను చేరుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
అలాగే, కేంద్రం ప్రారంభం నుండి ఎదురైన సవాళ్లను అధిగమించి, నిరంతరం అద్భుతమైన పనితీరును ప్రదర్శిస్తున్నందుకు జె.వి.ఆర్.సి. హెచ్.పి. అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ (ఈ & ఎమ్) ఎం. తిరుమల రావు తో పాటు జి.ఎం సి.హెచ్.పి’స్ రామ మూర్తి, జె.వి.ఆర్.ఓ.సి. ప్రాజెక్ట్ అధికారి ఎన్.వి.ఆర్. ప్రహ్లాద్, ఏరియా ఇంజనీర్ సూర్యనారాయణ రాజు, జె.వి.ఆర్.సి. హెచ్.పి. హెచ్.ఓ.డి. కె.సోమశేఖర రావు, జె.వి.ఆర్.ఓ.సి. ప్రాజెక్ట్ ఇంజనీర్ డి. శ్రీనివాస మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.


Comments