యాదవుల ఐక్యతకు చిహ్నంగా సదర్ వేడుక 

వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య 

హన్మకొండ,తెలంగాణ ముచ్చట్లు:

హనుమకొండలోని ఆర్టీస డిపో ఎదుట నిర్వహించిన సదర్ సమ్మేళన కార్యక్రమానికి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, రాజ్యసభ సభ్యులు  అనిల్ కుమార్ యాదవ్ ,పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి తో కలసి పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఎంపీ డా. కడియం కావ్య మాట్లాడుతూ.... 70, 80 సంవత్సరాల నుంచి సదర్‌ణు యాదవులు ఎంతో ఘనంగా నిర్వహిస్తూ వస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సదర్ పండుగను అధికారికంగా గుర్తిస్తూ జీఓ జారీ చేసారన్నారు.  ఈ సదర్‌ను అన్ని వర్గాల ప్రజలు ఎంతో ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. మొదటిసారి వరంగల్ లో ఈసదర్  ఉత్సవాలు జరుపుకోవడం, అందులో పాల్గొనందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో  ఈ ఉత్సవాలను పెద్ద ఎత్తున  జరుపుకుందాం అన్నారు. శ్రీ కృష్ణుని వారసులైన యాదవులు దీపావళి పండుగ తర్వాత ప్రతి సంవత్సరం ఈ సదర్ ను ఎంతో ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని వివరించారు. సదర్ ఉత్సవాల సందర్భంగా నిర్వహించే దున్నపోతుల విన్యాసాలను చూసేందుకు అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున వస్తారని తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ కడియం కావ్యని నిర్వహకులు శాలువాతో ఘనంగా సన్మానించి మెమెంటో లను అందజేశారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శివరాజ్ యాదవ్, బంక సంపత్ యాదవ్, కార్పొరేటర్ లు జక్కుల రమదేవి- రవి యాదవ్, బంక అశోక్ యాదవ్, కాంగ్రెస్ జిల్లా మహిళ అధ్యక్షురాలు బంక సరళ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.IMG-20241106-WA0027IMG-20241106-WA0026

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .