పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను కలిసిన శాగంటి మణి
చిల్పూర్,తెలంగాణ ముచ్చట్లు:
హైదరాబాద్ లోని గాంధీభవన్ లో టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని గురువారం చిల్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు శాగంటి మణి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా చిల్పూర్ మండలంలో పాత కాంగ్రెస్ క్యాడర్ ను స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి పట్టించుకోవడంలేదని తెలిపారు.ఇందిరమ్మ కమిటీల్లో మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలకు,నాయకులకు అవకాశం కల్పించాలని.అధికారంలో ఉన్న లేకున్నా పార్టీలోనే ఉండి పార్టీ కోసం పనిచేసినా వారికీ ప్రాధాన్యత ఇవ్వకుండా నిన్న గాక మొన్న పార్టీలోకి వచ్చినవారికి ప్రాధాన్యత కల్పిస్తున్నారని,కష్ట సమయాల్లో పార్టీ జెండాను మోసిన కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయంపై పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కు శాగంటి మణి వివరించారు.కడియం శ్రీహరి తన అనుచరులకె ప్రాధాన్యత కల్పిస్తున్నారని, గాంధీభవన్ లో తన ఆవేదన వ్యక్తం చేశారు.సానుకూలంగా స్పందించిన పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.


Comments