నిస్వార్థంగా పనిచేస్తేది కమ్యూనిస్టులే 

జిల్లెల చిన్నారెడ్డి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు

నిస్వార్థంగా పనిచేస్తేది కమ్యూనిస్టులే 

వనపర్తి,అక్టోబర్5(తెలంగాణ ముచ్చట్లు):

నిస్వార్ధంగా పనిచేసేది కమ్యూనిస్టు నాయకులేనని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. వనపర్తి పట్టణం సిపిఎం నాయకులు పుట్ట ఆంజనేయులు భార్య పుట్ట వరలక్ష్మి కోసం చిట్యాల గ్రామంలోని ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన సంస్కరణ సభలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో వరలక్ష్మికి ఘనంగా నివాళులు అర్పించారు.చిన్నారెడ్డి మాట్లాడుతూ, ఆంజనేయులు ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేసే నిజమైన నాయకుడని, వరలక్ష్మి  శరీరాన్ని వైద్య కళాశాలకు దానం చేసి, విద్యార్థులు ఉత్తమ వైద్యులుగా ఎదగడానికి సహాయపడటం ద్వారా సమాజానికి ఆదర్శంగా నిలిచారని అన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసి, కోలుకుని ధైర్యంగా ఉండాలని, భగవంతుని ప్రార్థనల ద్వారా కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని చిన్నారెడ్డి సూచించారు.ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా, మండల స్థాయి నేతలు, సీనియర్ పార్టీ నాయకులు, యువక సంఘాలు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .