ఈకాప్ రైటర్ రాజేష్కు ఘన వీడ్కోలు
Views: 46
On
కుషాయిగూడ, అక్టోబర్ 10 (తెలంగాణ ముచ్చట్లు):
కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో ఈకాప్ రైటర్గా విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ ఏ. రాజేష్ జవహర్నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో రాజేష్కు స్టేషన్ సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు.ఇన్స్పెక్టర్ ఎల్. భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ — రాజేష్ క్రమశిక్షణతో, నిబద్ధతతో విధులు నిర్వర్తించారని, స్టేషన్ పనుల నిర్వహణలో ఆయన పాత్ర ప్రశంసనీయమని తెలిపారు. ఆయన భవిష్యత్ సేవలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు.తరువాత రాజేష్ను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు సుధాకర్ రెడ్డి, వెంకన్న, సతీష్, సిబ్బంది సుబ్బారావు, శ్రీనివాస్, రంగన్న, ప్రణీత్, శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments