పదవి త్యాగంతో ఉద్యమాన్ని మొదలు పెట్టి.. 

ప్రాణాన్ని పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించిన నేత కేసీఆర్

పదవి త్యాగంతో ఉద్యమాన్ని మొదలు పెట్టి.. 

-తెలంగాణకు పునర్జన్మనిచ్చింది కరీంనగరే!

-అలుగునూర్ 'దీక్షాదీవాస్' లో కేటీఆర్

కరీంనగర్,తెలంగాణ ముచ్చట్లు:

 కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం అసన్నమైందని, ఇందుకు ప్రజలందరు సంఘటితం కావాలని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పిలుపునిచ్చారు.
 కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ అలుగునూర్ లో జరిగిన కేసీఆర్ దీక్షా దివాస్ సభలో ఆయన మాట్లాడారు. అమలుకు నోచుకోని హామీలిచ్చి ప్రజలను పక్కదారి పట్టించే కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజలు తిరబడే రోజులు దగ్గర పడుతున్నాయన్నారు. నప్రభుత్వ  ఒంటెద్దు పోకడలను అడ్డకట్ట వేసేందుకు ప్రజలు మరో పోరాటానికి సిద్దం కావాలన్నారు. రేవంత్ అధికారం చేపట్టి సంవత్సర కాలం కావస్తుంది కదా ఒక్కసారి ప్రలలోకి జనం నీకు ఏలా షాపనార్దాలు పెడుతున్నారో అర్థం అవుతుందన్నారు.ఎక్కడికైనా పోదాం ఏడాది పాలన ఎలా ఉందో ప్రజలు చెబుతారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలను ఓవైపు ప్రజలు చీదరించుకుంటున్నారని, అది చాలక కాంగ్రెస్ ప్రభుత్వ ఏముఖం పెట్టుకుని విజయటోత్సవాలు అర్థం కావడం లేదన్నారు. 2001లో కేసీఆర్ టీఆర్ఎస్ ను స్థాపించి రాజీలేని పోరాటం చేశారని, చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించగలిగాడని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కొనియాడారు. తెలంగాణకు పునర్జన్మనిచ్చీంది కరీంనగర్ జిల్లాయేనని కరీంనగర్ ప్రజలు ఉద్యమ స్పూర్తి చూపకుంటే తెలంగాణ వచ్చేది కాదని ఆయన స్పష్టం చేశారు.


 సభలో పాల్గొన్న మాజీ మంత్రి, ఎంఎల్ఏ గంగుల కమలాకర్ మాట్లాడుతూ... 2001లో ఉవ్వెత్తున ఎగసిన పడిన ఉద్యమానికి తలొగ్గే విధిలేని పరిస్థితుల్లో అనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్రం ఇవ్వక తప్పలేదన్నారు. ఎంతో మంది యువకులు ప్రాణ త్యాగాల పునాదులతో రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసిఆర్ తో పాటు తెలంగాణ ప్రజలకు దక్కుతుందన్నారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్ అడుక్కునే పరీస్థితి వచ్చన సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ కాలీ గోటికి కూడా సరిపోడని ఏద్దవా చేశారు.

WhatsApp Image 2024-11-29 at 9.41.02 PM ఈ సభలో మాజీ రాజ్యసభ్యుడు బండ ప్రకాష్,మాజీ ఎంఎల్ఏ లు సంకే రవిశంకర్, రసమయి బాలరకిషన్,టీఆర్ఎస్ పార్టీ జిల్లా అద్యక్షుడు జివి రామ క్రష్ణారావు, జిల్లా పరిషత్ మాజీ చేర్ పర్సన్ కమనుల్ల విజయ, మాజీ సివిల్ సప్లై కార్పోరేషన్ మాజీ ఛైర్మన్ రవిందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు మేయర్ సునీల్ రావు, బీఆర్ఎస్ నగర శాఖ అధ్యక్షులు చల్ల హరిశంకర్ లు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .