శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న యువ నేతను పరామర్శించిన తాటికొండ రాజయ్య
ధర్మసాగర్:
ధర్మసాగర్ మండలంలోని తాటికాయల గ్రామంలో శస్త్రచికిత్స అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు బోల్లేపాక సంపత్ను తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య పరామర్శించారు.
సంపత్ నివాసానికి వెళ్లిన ఆయన, ఆరోగ్య పరిస్థితి వివరాలను తెలుసుకొని వైద్యపరమైన సూచనలు అందించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో క్షేమవార్తలు అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి ననుబాల చంద్రమౌళి, గ్రామ శాఖ అధ్యక్షుడు వల్లాల నర్సయ్య,సీనియర్ నాయకులు ఎర్ర అశోక్, పట్ల మీసా రాజయ్య, ఎర్ర వెంకటస్వామి,పట్ల మహేష్,కనుకటి రవీందర్,చింతకింది రమేష్,పట్ల రమేష్ మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు, స్థానిక నాయకులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.


Comments