191వ జ్ఞానమాల కార్యక్రమం

ముఖ్య అతిథిగా డాక్టర్ రాంబాబు

191వ జ్ఞానమాల కార్యక్రమం

కీసర, అక్టోబర్ 5 (తెలంగాణ ముచ్చట్లు):

కీసర మండలం అంబేడ్కర్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 9 గంటలకు 191వ వారం జ్ఞానమాల కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కొమ్ము సుదర్శన్, ప్రధాన కార్యదర్శి తుడుం శ్రీనివాస్ సమన్వయంతో కార్యక్రమం సజావుగా జరిగింది.ముఖ్య అతిథిగా కీసర గ్రామానికి చెందిన డాక్టర్ రాంబాబు హాజరై మాట్లాడారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆశయాలు సమాజ అభివృద్ధికి దారితీయాలని, యువత ఆ ఆలోచనలను ఆచరణలో పెట్టాలని ఆయన పిలుపు నిచ్చారు. ప్రపంచంలోనే గొప్ప మేధావిగా నిలిచిన అంబేడ్కర్  స్ఫూర్తి అందరికి దిశానిర్దేశం చేయాలని అన్నారు. విద్యార్థులు తప్పు దారుల్లో కాకుండా క్రీడా రంగం, విద్యారంగాల్లో రాణించాలని సూచించారు.ఈ కార్యక్రమం లో అంబేడ్కర్ సంఘం ఉపాధ్యక్షుడు బక్కని కుమార్, మాజీ వార్డ్ సభ్యులు శీలం శ్రీనివాస్, తుడుం శంకరయ్య, కుంటోళ్ళ సత్యనారాయణ, బంటు శ్రీనివాస్, తుడుం ఆగమయ్య, కుంటోళ్ళ ఆంజనేయులు, రాగుల రమేష్ ముదిరాజ్, పూండ్రు కిష్టయ్య, రిపోర్టర్ తుడుం బాలకృష్ణ, పండుగ రాజలింగం ముదిరాజ్, ఎర్ర సాయిలు, కిరణ్, రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .