మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలి...
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం బ్యూరో, అక్టోబర్ -07, తెలంగాణ ముచ్చట్లు;
మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని వారి ఆశయాల సాధన దిశగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.
ఆదికవి శ్రీ మహర్షి వాల్మీకి జయంతిని పురస్కరించుకొని మంగళవారం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొని, మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ మహాకవి వాల్మీకి
ఆధ్యాత్మికవేత్తగా రామాయణ కావ్యం రచించి ఆదికవిగా వెలుగొందారని, రామాయణం ద్వారా అనేక విలువలను సమాజానికి అందించారని అన్నారు. రామాయణం ద్వారా ఆదర్శ మానవుడికి ఉండవలసిన లక్షణాలు, మానవ సంబంధాలు, విలువలను మహాకవి మనందరికీ బోధించారని అన్నారు. ఆదికవి శ్రీ మహర్షి వాల్మీకి జయంతిని జరుపు కోవడం సంతోషకరమని తెలిపారు. అనంతరం వక్తలు మహర్షీ వాల్మీకి జీవిత విశేషాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ అభివృద్ధి అధికారిణి జి. జ్యోతి, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్ లు, కలెక్టరేట్ సిబ్బంది, బీసీ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


Comments