మీడియా పాయింట్ అధ్యక్షుడికి సన్మానం

మీడియా పాయింట్ అధ్యక్షుడికి సన్మానం

హసన్ పర్తి తెలంగాణ ముచ్చట్లు:

 హసన్ పర్తి మండల మీడియా పాయింట్ అధ్యక్షుడిగా ఎన్నికైన ఎలుక రాజు సదానందం( వార్త ) ను మంగళవారం తన చిన్ననాటి స్నేహితులైన వినాయక పరపతి సంఘం సభ్యులు ఘనంగా సన్మానించుకున్నారు. ఈ సందర్భంగా పరపతి సంఘం అధ్యక్షుడు గుడికందుల సురేష్ మాట్లాడుతూ తమ మిత్రుడైన సదానందం మీడియా పాయింట్ అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు మాకు గర్వంగా ఉందని తెలిపాడు. మండలంలోని సమస్యలను వెలికి తీసి సామాన్య ప్రజలకు న్యాయం జరగడంలో ముందు వరుసలో ఉండాలని కోరారు. రెండు సంవత్సరాల పాటు అధ్యక్షుడు స్థానంలో ఉండే అనేక సమస్యలకు పరిష్కారం చూపుతాడని ఆశాభావాన్ని స్నేహితులు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సదానందం మాట్లాడుతూ తన ఉన్నతిని ఆకాంక్షిస్తూ స్నేహితుల సత్కరించడం గర్వంగా ఉందని, ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపాడు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కాలే యాదగిరి, కోశాధికారి నాగేందర్, గౌరవ సభ్యులు వెంకటస్వామి, మీసరికొండ సాంబయ్య, సభ్యులు బరుపటి సంపత్, దీకొండ బిక్షపతి ,ఉప్పుల రవీందర్, గంట రమేష్, సండ్రు నటరాజ్, రాజేంద్రప్రసాద్, ఎలక రాజ్ కుమారస్వామి, ముస్తాక్, తదితరులు ఉన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .