కలెక్టర్ ని కలిసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్, సెప్టెంబర్ 26(తెలంగాణ ముచ్చట్లు)
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్మిక్కిలినేని మను చౌదరీ, ఐ.ఎ.ఎస్ ని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి తో కలిసి మల్లాపూర్ డివిజన్ పరిధిలోని నేహృనగర్ కాలనీకీ ఎదురుగా, ఎన్ఎఫ్సి కంపెనీ ప్రహరీగోడను అనుకోని ఉన్న టీఎస్ఐఐసి కీ సంబంధించిన మల్లాపూర్ గ్రామ సర్వే నెం 44, 45 లోని ఎన్ ఎఫ్ సి వారు వదిలినటువంటి నిరుపయోగంగా ఉన్న ఖాలీ స్థలము కబ్జాలకు గురవుతున్నది, ఇట్టి స్థలాన్ని అప్పట్లో టిఎస్ఐఐసి మౌలాలి ఐఏఎల్ఏ వారికీ ప్రభుత్వం వారు అప్పగించాడము జరిగింది అని ఆయన అన్నారు.ఇట్టి నిరుపయోగంగా ఉన్న ఖాలీ స్థలాన్ని ప్రభుత్వం వారు స్వాధీనం చేసుకొని స్థానిక కాలనీ వాసులకు ఉపయోగపడే విధంగా కమ్యూనిటీ హాలు మరియు పార్కును అభివృధి చేస్తే స్థానిక ప్రజలకు చాల ఉపయోగకరంగా ఉంటుందని, స్థానిక ప్రజల కోరిక మేరకు తమరిని కోరడమైనది అని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు.ఎన్ఎఫ్సీ అనుకోని కడుతున్న ప్రవారీ గోడ నీ ఆపాలని కోరారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రవీణ్ ముదిరాజ్, ఆకుల మహేందర్, మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


Comments