గ్రూప్-1లో విజయకేతనం ఎగురవేసిన వంగ అక్షయ్ కుమార్ రెడ్డి

పట్టుదలతో సాధించిన డీఎస్పీ ఉద్యోగం

గ్రూప్-1లో విజయకేతనం ఎగురవేసిన వంగ అక్షయ్ కుమార్ రెడ్డి

మేడ్చల్ మల్కాజ్గిరి, సెప్టెంబర్ 29 (తెలంగాణ ముచ్చట్లు):

 కృషి, పట్టుదలతో చదివితే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించారు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన వంగ అక్షయ్ కుమార్ రెడ్డి. గ్రూప్-1 పోటీ పరీక్షల్లో 228వ ర్యాంక్ సాధించి డీఎస్పీగా నియామకం పొందారు.జగద్గిరిగుట్ట ఆల్విన్ కాలనీలో నివాసం ఉంటున్న అక్షయ్ చిన్ననాటి నుండి అక్కడే చదువుకున్నారు.WhatsApp Image 2025-09-29 at 7.48.06 PM సీఏ, ఎం.ఏ ఎకనామిక్స్ పూర్తి చేసిన అనంతరం సివిల్ సర్వీసెస్‌కి సిద్ధమయ్యారు. అదే సమయంలో గ్రూప్-1 పరీక్ష రాసి విజయాన్ని సొంతం చేసుకున్నారు.ఏడు సంవత్సరాల క్రితం గుండెపోటుతో తండ్రి మృతి చెందగా, తల్లి రేణుక ఇచ్చిన ప్రోత్సాహమే తనకు బలమైందని అక్షయ్ చెబుతున్నారు. “ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తే ఎవరికైనా అనుకున్న లక్ష్యం సాధ్యమే. ఈ విజయానికి కారణం నా తల్లి చేసిన త్యాగమే” అని ఆయన భావోద్వేగంతో అన్నారు.
అక్షయ్ విజయంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఆనందం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .