చెల్లని చెక్కు కేసులో 6 నెల్లలు జైలు శిక్ష
Views: 13
On
భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు :
భద్రాచలం జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టు జడ్జి శివ నాయక్ సోమవారం చెక్కు కేసులో ఆరు నెలలు జైలు శిక్ష, రూ.5,00,000/- జరిమానా విధించారు.
కల్లెం వీరాంజనేయులు వద్ద రాంశెట్టి శ్రీను(ఐటీసీ ఎంప్లాయ్ సారపాక) 5 లక్షల రూపాయలు చెక్ హామీగా పెట్టి రూ. 5,00,000/- తీసుకున్నాడు..
ఆ చెక్ బ్యాంకులో వేయగా చెక్ బౌన్స్ అయింది. సదరు కల్లెం వీరాంజనేయులు కోర్టులో కేసు వేయడం జరిగింది. సదరుకోర్టులో వాదపవాదములు అనంతరం ముద్దాయి రామ్ శెట్టి శ్రీనుకు ఆరు నెలలు జైలు శిక్ష, రూ. 5,00,000/- నష్టపరిహారం విధించారు. పిర్యాదు తరుపున ప్రముఖ న్యాయవాది ముత్యాల కిషోర్ కేసు వాదించినారు
Tags:
Related Posts
Post Your Comments
Latest News
04 Aug 2025 22:25:25
చర్లపల్లి, తెలంగాణ ముచ్చట్లు:
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ ఈనెల 7న తలపెట్టిన ఛలో...
Comments