ధర్మసాగర్ విద్యార్థి దేవర కార్తీక్ రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపిక

ధర్మసాగర్ విద్యార్థి దేవర కార్తీక్ రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపిక

ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:
ధర్మసాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థి దేవర కార్తీక్ తన ప్రతిభతో రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలో నిర్వహించిన అండర్-17 విభాగం సాఫ్ట్బాల్ పోటీల్లో విశేష ప్రతిభను కనబరచిన కార్తీక్, డిసెంబర్ 7 నుండి 9 వరకు నిజామాబాద్‌లో జరుగనున్న పోటీల్లో పాల్గొననున్నాడు.

పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయురాలు బి. ప్రసన్న కార్తీక్ ప్రతిభను ప్రశంసిస్తూ, అతని విజయాన్ని పాఠశాలకు గర్వకారణంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన అభినందన కార్యక్రమంలో ధర్మసాగర్ మండల విద్యాధికారి డాక్టర్ రామ్ధన్ కార్తీక్‌ను అభినందించి ప్రశంసా పత్రం అందించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొని కార్తీక్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ప్రజాయుద్ధనౌక గద్దర్ జయంతి వేడుకలు  ప్రజాయుద్ధనౌక గద్దర్ జయంతి వేడుకలు 
కీసర, ఫిబ్రవరి 01(తెలంగాణ ముచ్చట్లు) తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసి, ప్రజల్లో చైతన్యం రగిలించిన ప్రజాయుద్ధనౌక గద్దర్ జయంతిని సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. పోరాట తత్వం,...
మాఘ పౌర్ణమి సందర్భంగా హేమాద్రి వెంకటేశ్వర స్వామి గిరి ప్రదక్షిణ 
గ్రామీణ వైద్యుల శిక్షణను తిరిగి ప్రారంభించాలి
స్పోర్ట్స్ మీట్ తో విద్యార్థుల్లో నూతన ఉత్తేజం పెంపొందుతుంది.
ధన్యజీవి ఏపూరి సీతయ్య
ప్రత్యేక సమగ్ర సవరణను పకడ్బందీగా నిర్వహించాలి.. 
ప్రభుత్వ ప్రాధాన్యత పనుల పూర్తిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి....