ధర్మసాగర్ విద్యార్థి దేవర కార్తీక్ రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపిక

ధర్మసాగర్ విద్యార్థి దేవర కార్తీక్ రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపిక

ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:
ధర్మసాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థి దేవర కార్తీక్ తన ప్రతిభతో రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలో నిర్వహించిన అండర్-17 విభాగం సాఫ్ట్బాల్ పోటీల్లో విశేష ప్రతిభను కనబరచిన కార్తీక్, డిసెంబర్ 7 నుండి 9 వరకు నిజామాబాద్‌లో జరుగనున్న పోటీల్లో పాల్గొననున్నాడు.

పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయురాలు బి. ప్రసన్న కార్తీక్ ప్రతిభను ప్రశంసిస్తూ, అతని విజయాన్ని పాఠశాలకు గర్వకారణంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన అభినందన కార్యక్రమంలో ధర్మసాగర్ మండల విద్యాధికారి డాక్టర్ రామ్ధన్ కార్తీక్‌ను అభినందించి ప్రశంసా పత్రం అందించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొని కార్తీక్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి
పటాన్‌చెరు, తెలంగాణ ముచ్చట్లు: పటాన్‌చెరు మండల పరిధిలో ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ నవభారత్...
ప్రైవేట్ పాఠశాలలపై విద్యార్థి సంఘాల ఆగ్రహం
సరస్వతి ఆలయంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకి అక్షరాభ్యాసం 
జాతీయ స్థాయిలో మాంట్ ఫోర్ట్ విద్యార్థుల ప్రతిభా 
అడ్లూరి లక్ష్మణ్‌కు మంత్రి పదవి మాదిగలకు దక్కిన గౌరవం  
ప్రతి పుట్టినరోజున ఒక మొక్క నాటుతూ ఆదర్శంగా నిలుస్తున్న విద్యార్థిని జశ్విత
అధైర్య పడాల్సిన అవసరం లేదు  సముచిత స్థానం కల్పిస్తాం