కరాటే పోటీల్లో సెయింట్ ఆంథోనీ విద్యార్థుల విశేష ప్రతిభ
Views: 14
On
ధర్మసాగర్, తెలంగాణ ముచ్చట్లు:
2024 ఇంటర్ స్టేట్ కరాటే ఛాంపియన్షిప్ కోసం మంగళవారం కాకతీయ యూనివర్సిటీలో నిర్వహించబడిన కరాటే పోటీల్లో సెయింట్ ఆంథోనీ పాఠశాల విద్యార్థులు అపూర్వ ప్రతిభను కనబరిచారు. పాఠశాల నుంచి 29 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొనగా, వీరిలో 7 మంది బంగారు పతకాలు, 12 మంది సిల్వర్ పతకాలు, 10 మంది బ్రాంజ్ పతకాలు సాధించారు.
పాఠశాల శిక్షకులు, కరాటే కోచ్లు ఈ విజయాన్ని మరింత గొప్పదిగా చేయడం కోసం విద్యార్థులను మరింత మెరుగైన శిక్షణతో రాష్ట్ర, అంతర్జాతీయ స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొనడానికి సిద్ధం చేస్తామని తెలిపారు.ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ రాజారపు ప్రతాప్, కరస్పాండెంట్ ప్రభుదేవ్, డైరెక్టర్ అనూష, ప్రిన్సిపల్ వేల్పుల అశోక్, ఉపాధ్యాయులు ఈ విజయానికి సానుభూతి తెలుపుతూ విద్యార్థులను అభినందించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
04 Aug 2025 22:25:25
చర్లపల్లి, తెలంగాణ ముచ్చట్లు:
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ ఈనెల 7న తలపెట్టిన ఛలో...
Comments